Sunday 20 April 2014

తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలి- తమ్మినేని

Thammineni Veerabhadram
thammineni veerabhadra 
హైదరాబాద్: సామాజిక తెలంగాణ కోసం సీపీఎం కట్టుబడి ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం పార్టీ తరపున ఉప్పల్ లో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. సీపీఎం ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పారు. తెలంగాణలో సాధారణ పౌరునుకి సైతం అభివృద్ధి ఫలాలు అందినపుడే అది జన తెలంగాణ అవుతుందని అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ కోసం సీపీఎం పోరాడిందని చెప్పారు. హరిజన వాడలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర బడ్టెట్ లో 8 శాతం నిధులు కేటాయించాలని చెప్పారు. సీపీఎం తెలంగాణ సమగ్ర అభివృద్ధిని కోరుకుంటోందని అన్నారు. హైదరాబాద్ లోనే కాదు మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఉప్పల్ నియోజకవర్గ సీపీఎం అభ్యర్ధి నర్సింహారెడ్డిని గెలిపించాలనిరారు.

No comments:

Post a Comment