Friday 28 November 2014

కార్మిక చట్టాలకు మోడీ సర్కార్ సవరణ... 70శాతం సంఘటిత కార్మికశక్తి అడ్రస్ గల్లంతు


-స్టడీ గ్రూప్
          31శాతం ఓట్లతో గద్దెనెక్కిన మోడీ సర్కార్ దేశంలోని 70శాతం సంఘటిత కార్మికశక్తి అడ్రస్సును గల్లంతు చేసేందుకు, వారికి ఎలాంటి కార్మిక చట్టాలు, రక్షణలు వర్తించకుండా చేసేందుకు కుట్ర పన్నింది. విపక్షాల త్రీవ నిరసన నడుమ ఈ మేరకు కార్మిక చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించుకుంది. చట్ట రూపం దాల్చనున్న ఈ బిల్లు పేరు Labour Laws (Exemption from Furnishing Returns and Maintaining Registers by Certain Establishments) Amendment Bill, 2011. 
16 కార్మిక చట్టాలపై వేటు           
          ''ఆదాయం పన్ను వివరాలను సమర్పించడం, రిజిస్టర్లు మెయిన్ టెయిన్ చేయడం నుంచి చిన్న సంస్థలకు మినహాయింపు నిస్తున్నాం'' అనే ముసుగులో చిన్న సంస్థల నిర్వచనాన్ని, వాటికి వర్తించని చట్టాల జాబితానూ మార్చేసింది. 
           మార్చిన చిన్న సంస్థల నిర్వచనం ప్రకారం ప్రస్తుతం 19గా ఉన్న కార్మికుల సంఖ్య పరిమితిని 10 నుంచి 40కి పెంచింది. 40 మంది లోపు కార్మికులున్న ఏ సంస్థ అయినా ఈ కింది చట్టాల నుంచి మినహాయింపు పొందుతుంది. 
1. The Payment of Wages Act, 1936 (4 of 1936).
2. The Weekly Holidays Act, 1942 (18 of 1942).
3. The Minimum Wages Act, 1948 (11 of 1948).
4. The Factories Act, 1948 (63 of 1948).
5. The Plantations Labour Act, 1951 (69 of 1951).
6. The Working Journalists and other Newspaper Employees (Conditions
of Service) and Miscellaneous Provisions Act, 1955 (45 of 1955).
7. The Motor Transport Workers Act, 1961 (27 of 1961).
8. The Payment of Bonus Act, 1965 (21 of 1965).
9. The Beedi and Cigar Workers (Conditions of Employment) Act, 1966
(32 of 1966).
10. The Contract Labour (Regulation and Abolition) Act, 1970 (37 of
1970).
11. The Sales Promotion Employees (Conditions of Service) Act, 1976 (11
of 1976).
12. The Equal Remuneration Act, 1976 (25 of 1976).
13. The Inter-State Migrant Workmen (Regulation of Employment and
Conditions of Service) Act, 1979 (30 of 1979).
14. The Dock Workers (Safety, Health and Welfare) Act, 1986 (54 of
1986).
15. The Child Labour (Prohibition and Regulation) Act, 1986 (61 of 1986).
16. The Building and Other Construction Workers (Regulation of
Employment and Conditions of Service) Act, 1996 (27 of 1996).
      ఆయా సంస్థలు పై చట్టాల నుంచి మినహాయింపు పొందడం అంటే ఏమిటి? చట్టాల పేర్లన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కార్మికుల శ్రేయస్సుకుద్దేశించిన చట్టాలని అర్థమవుతోంది. 40 మంది వరకున్న సంస్థలకు ఇవి వర్తించవంటే అర్థం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు ఈ 16 చట్టాల ద్వారా ఎలాంటి హక్కులూ, రక్షణా లభించబోవు.
      ఈ 16 చట్టాల్లో అత్యంత ప్రాథమిక చట్టాలున్నాయి. ఉదాహరణకు కనీస  వేతన చట్టం. వేతనాలు చెల్లించకపోతే వేతనాలు చెల్లింపు చేయమనే చట్టంమెటర్నిటీ లీవు చట్టం. ఇప్పుడు ఈ చట్టాలేవీ వర్తించవు. 
      ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతూ `కార్మిక హక్కుల రక్షణ కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఈ సంస్కరణలు` అని మోడీ సర్కారు చెప్పింది. ఉన్న 16 చట్టాలు వర్తించకుండా చేసి, ఉన్న హక్కులను, రక్షణలను రద్దు చేసి, హక్కుల రక్షణకోసం ఎలా కృషి చేస్తుంది? నోటితో చెప్పే మాటలకు, చట్టాల రూపంలో చేస్తున్న చేతలకు మధ్య తేడా లేకపోతే దానినేమనాలి? పచ్చి కపటనాటకం తప్ప.
నష్ట పోయే వారి సంఖ్య లక్షల్లో కాదు కోట్లల్లో...     
  15వ లోక్ సభ, కార్మికులు మరియు ఉపాధి స్టాండింగ్ కమిటీ (2011-12) ఈ బిల్లును అధ్యయనం చేసింది. ఈ బిల్లు అమలైతే ప్రభావితం కాబోయే కార్మికుల సంఖ్యను లెక్కించేందుకు ప్రయత్నించింది.  "Based on Economic Census, 2005 conducted by Central Statistical Organization, there are a total of 418.27 lakh (41.83 million/4.18 crore) establishments with a total employment of 1009.04 lakh (100.90 million/10.09 crore) persons. The break-up of ̳small ఆstablishments‘ is not available." అని చెప్పింది. 
       ఇవి 2005 నాటి లెక్కలు. ఇప్పుడు సంఖ్య పెరిగి ఉంటుంది. అయితే ఇది కూడా  గణాంకాల శాఖ  సేకరించిన లెక్కలు. పరిశ్రమల శాఖ, లేదా కార్మిక శాఖ వద్ద చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఎలాంటి గణాంకాలూ లేవు. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు.
గణనీయంగా పెరగనున్న అసంఘటిత రంగం...
        ప్లానింగ్ కమిషన్ గణాంకాలు, భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం భారతదేశంలో 48.7కోట్ల మంది కార్మికులున్నారు. వీరిలో 94శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి ఎలాంటి చట్టాలూ వర్తించవు. రక్షణలూ లేవు. వీరిని తక్షణం సామాజిక భద్రత కిందకు తీసుకురావాలని ప్లానింగ్ కమిషన్ స్వయంగా చెప్పింది.    
  మొత్తం కార్మిక శక్తిలో ఆరుశాతం సంఘటిత రంగంలో ఉంది.
       కార్మిక చట్టాలు, ఇతర నియంత్రణల కోసం ప్లానింగ్ కమిషన్ వర్కింగ్ గ్రూపు ప్రకారం (27వ పేజీలో) ``The Working Group recognized that for around 94 per cent of the workforce being employed in the unorganized sector there is an urgent need to protect their interest by providing them the minimum living wage,
improved regulatory activities, basic social security and labour welfare schemes and improved health and safety facilities. The living standards of this segment of the workforce need urgent attention since the workers in this sector have no security of job and are often deprived of the basic rights under various labour laws. The enactment of the Unorganized Workers Social Security Act, 2008 is a step in the right direction but still much more needs to be done.``
        ఆరుశాతంగా ఉన్న సంఘటిత కార్మిక శక్తిలో 70శాతం వాటా చిన్న సంస్థలది. కార్మికులు, ఉద్యోగుల సంఖ్యను 40 వరకు పెంచి `చిన్న సంస్థల`  నిర్వచనం మార్చేయడంతో ఈ వాటా 95శాతానికి పెరగనుందని ఒక అంచనా.
       ఏ చట్టాలు వర్తించని వారు అసంఘటిత రంగ కార్మికులు అనుకుంటే, ఏ చట్టాలూ  వర్తించకుండా చిన్న సంస్థల్లో పని చేస్తున్న కార్మికులంతా అసంఘటిత కార్మికులే అవుతారు. కార్మిక చట్టాలు అమలయ్యేది మిగిలిన భారీ ప్రభుత్వ రంగ, ప్రయివేటు రంగ సంస్థలు, వాటిశాఖల్లో మాత్రమే.
       ఈ లెక్కన, ఎంత సరైన సంఖ్య కానప్పటికీ భారతదేశంలోని 48.7 కోట్ల కార్మికుల్లో కార్మిక చట్టాలు వర్తించని వారి సంఖ్య 46కోట్లుగా ఉండబోతోంది...
చట్టం మార్చడం వల్ల ఎవరికి ఉపయోగం?       
          స్టాండింగ్ కమిటీ రిపోర్టు 29వ పేజీలో ఇలా ఉంది. ''Regrettedly, the Government have
neither any information regarding the number of persons working in these 'Small Establishments' nor are they aware as to whether all these establishments are regularly submitting their returns.``
       దీనర్థం ఏమిటి? ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా ఏది చిన్న సంస్థ? ఎంత మంది కార్మికులున్నారు? అనే రికార్డే మెయిన్ టెయిన్ చేయడం లేదు. అలాంటిది చిన్న  సంస్థల్లో ఉన్న కార్మికుల శ్రేయస్సును కాపాడేందుకు ఈ సవరణను తీసుకువచ్చానని మోడీ సర్కారు చెబుతోంది.
       కమిటీ రిపోర్టులోని అదే పేజీలో ఇలా పేర్కొంది. ''The Committee observe that the objective behind Section 4(5) of the amendment Bill, 2011 is to exempt the employers from imposition of penalties. In the given scenario when there is no provision of punishment in the Act itself, it is open for the establishment not to furnish the returns which could reveal his status of micro, small and medium enterprise. The Committee are of theconsidered view that a Law without penal provision is teethless and cannot be enforced.``
       ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో యాజమాన్యాల మీద ఎలాంటి పెనాల్టీని ప్రతిపాదించలేదు. శిక్షలు కూడా లేవు. శిక్షలు, పెనాల్టీలు లేకపోతే మిగిలిన హక్కులు కూడా వర్తిస్తాయన్న గ్యారెంటీ లేదు. 
         పోనీ చట్టం మార్చిన తరువాతైనా పరిశ్రమలను మానిటర్ చేసే సత్తా సంబంధిత శాఖకు ఉందా అంటే లేదని స్టాండింగ్ కమిటీ సభ్యుల పరిశీలనలో తేలిపోయింది. పరిశ్రమల శాఖ, కార్మిక శాఖకు సంబంధించిన సిబ్బంది గణాంకాలు, స్వయంగా కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలు తనిఖీ చేసి ఈ నిర్దారణకు వచ్చారు.
       లెక్కలు లేవు. శిక్షలు లేవు. శిక్షించే వారూ లేరు. అంటే ఆధునిక భారతదేశంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న కార్మికులంతా ఎలాంటి రక్షణలు లేకుండా కట్టుబానిసలుగా పని చేయాల్సిన  స్థితిని మోడీ ప్రభుత్వం సృష్టించింది. కార్మికులు ఎదురుతిరిగితే యాజమాన్యం దాడులు చేయొచ్చు. తొలగించొచ్చు. వారిని అడిగేవారూ ఉండరు. 
కార్మికుల అడ్రస్సు గల్లంతు
       చిన్న సంస్థలు గతంలో కార్మికుల పేర్లు, వారి అడ్రస్సులు కూడా నింపి ఇవ్వాల్సిన అవసరం ఉండేది. మోడీ సర్కార్ సవరించిన బిల్లు ప్రకారం కార్మికుల సంఖ్య పేర్కొంటే సరిపోతుంది. కార్మికుల అడ్రస్సుతో పని లేదు. 
       కార్మికుడి పేరు, అడ్రస్సు ఉంటే ఇఎస్ఐ, పిఎఫ్ వంటివి పొందేందుకు ఆస్కారం లభించేది. ఇప్పుడు పేర్లు అక్కర్లేదు. కాబట్టి ఈ రెండూ వర్తించవు. ఇఎస్ఐ స్థానంలో ఇన్సూరెన్స్ ను ప్రవేశపెడుతున్నారు. అయితే దీనిని కూడా కార్మికులు, ఉద్యోగులు తమ స్వంత డబ్బులతో కొనుక్కోవాలి.
        కార్మికుడి అడ్రస్సు రిజిస్టర్ అయి ఉంటే, ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. వలస వచ్చిన కార్మికులు మహబూబ్ నగర్ లో చనిపోతే వారి అడ్రస్ లేకపోవడం వల్ల మహబూబ్ నగర్ లోనే ఖననం చేశారు. రేపు రేపు చిన్న సంస్థల ముసుగులో ఉన్న పరిశ్రమలన్నింటా ఇదే జరగబోతోంది. 
ఏది చిన్న సంస్థ?
      ఒక సంస్థ చిన్నదా? పెద్దదా? అని నిర్ణయించేటప్పుడు కార్మికుల సంఖ్యను చూడాలా? లేదా ఆ సంస్థ పెట్టుబడిని చూడాలా? కార్మికుల సంఖ్యను బట్టి చూస్తే ఎంత ఎక్కువ మంది కార్మికులుంటే అంత పెద్ద సంస్థ అనుకునే అవకాశం ఉంది. అదే పెట్టుబడిని బట్టి చూస్తే ఎంత ఎక్కువ పెట్టుబడి ఉంటే అంత పెద్ద సంస్థ అవుతుంది. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండి, పెట్టుబడి ఎక్కువగా ఉండే సంస్థలు చిన్న సంస్థలా? పెద్ద సంస్థలా?
      ఓ ఉదాహరణ చూద్దాం. విజయవాడ ల్యాంకో వందలకోట్ల పెట్టుబడితో పెట్టిన పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంఖ్య కేవలం 27. ఇప్పుడిది పెద్ద సంస్థనా? చిన్న సంస్థనా?
     పెట్టుబడి ఎక్కువగా ఉండి, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే అనేక బడా సంస్థలు ఇప్పుడు అతి తక్కువ మంది కార్మికులను కలిగి ఉంటున్నాయి. వీటి టర్నోవర్ కోట్లలో ఉంటుంది. లాభాలూ అలాగే ఉంటాయి. 40 అనే సంఖ్యను ప్రకటించడం ద్వారా ఇలాంటి సంస్థల్లో పనిచేసే కార్మికులందరూ హక్కులను, చట్టాల ద్వారా రక్షణలనూ కోల్పోనున్నారు.
      మరో ఉదాహరణ చూద్దాం.... ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఫ్యాక్టరీ నిర్వచనం ఇలా ఉంటుంది.  కరెంటు ఉండి 10 మంది కార్మికులుండాలి. లేదా కరెంటు లేకుండా 20 మంది కార్మికులుండాలి. ఇప్పుడు ఈ సంఖ్యను కూడా వరుసగా 20, 40కి పెంచేశారు. ఒకసారి అది ఫ్యాక్టరీ అనే నిర్వచనం కిందకు వస్తే దీనికి సంబంధించిన అన్ని చట్టాలూ వర్తించాలి.
      కరెంటుతో సంబంధం ఉన్నా, లేకపోయినా 40మంది వరకు కార్మికులుంటే ఏ చట్టాలూ వర్తించవని చెప్పిన తరువాత ఫ్యాక్టరీ చట్టంలో భాగంగా వర్తించే చట్టాలన్నీ ఒక్కసారిగా కొట్టివేయబడ్డట్లే.
మరిన్ని కార్మిక సంస్కరణలు     
     ఈ ఒక్క బిల్లుతోనే బిజెపి ప్రభుత్వం ఆగిపోలేదు. మిగిలిన కార్మిక చట్టాలనూ సవరిస్తోంది. ఉదాహరణకు  చిన్న సంస్థల్లో బోనస్ 8.33శాతమే ఇవ్వాలని నిబంధన విధించారు. ఇప్పటివరకు కొన్ని సంస్థల్లో 20శాతం వరకూ ఇచ్చేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కార్మికులు కోల్పోబోతున్నారు. పిఎఫ్, గ్రాట్యూటీ వంటివన్నీ సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన పరిస్థితి 
     కార్మికుల సమస్యలను రిప్రజంట్ చేయడానికి 51శాతం కార్మికులుండాలన్న నిబంధనను తీసుకువచ్చారు. చిన్న సంస్థల్లో 40 మంది అంటే దాదాపు 21 మంది రిప్రజంటేషన్ కు సిద్ధపడాలి. యాజమాన్యం 90 రోజుల్లో పరిష్కరించకపోతే లేబర్ కోర్టుకు పొమ్మంటున్నారుపోరాడే హక్కును లేకుండా చేస్తున్నారు.
     ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటివన్నీ సొంత డబ్బులతోనే కొనుక్కునే విధంగా చట్టాలను మార్చేస్తున్నారు.
     ప్రధాని నరేంద్ర మోడీ దేశదేశాలు తిరిగి ఊదరగొడ్తున్న 'ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ` మోడల్ ఇదే. కార్మికులను కొట్టి కార్పొరేట్లకు వేయడమే దీని సారాంశం. 
ఈ సంస్కరణల వెనుక...?
     ఎన్నికలకు ముందు నుంచే దేశంలోని బడా కార్పొరేట్లు, పెట్టుబడిదార్లు ఈ సంస్కరణల కోసం భారీ కసరత్తు ప్రారంభించారు. అందులో కీలకమైనది.. ''ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ3 ఏర్పడాలి. లేదంటే మోడీ నాయకత్వంలో మోడీ 2 ఏర్పడాలి. వామపక్షాల ప్రమేయం గల ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడకూడదు. ''
    వారెందుకిలా కోరుకున్నారు? కారణం సుస్పష్టం. ''ప్రపంచం, మన దేశం కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే మార్గం కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారీ వర్గం గరిష్ట లాభాలు తగ్గకుండా ఉండాలి. అలా జరగాలంటే సంక్షోభ భారం ప్రజలపై వేయాలి. తమకు లాభాలు తెచ్చిపెట్టే విధానాలు అమలు చేయాలి. అలాంటి ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలి. జిడిపి బాగా అభివృధ్ధి చెందుతున్న సమయంలో పాలకవర్గాలకు గరిష్ట లాభాలు సమకూరుస్తూనే,  ప్రజలకు కొన్ని సంక్షేమ చర్యలు చేపట్టే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. కాని సంక్షోభ కాలంలో ప్రభుత్వం ముందు - బడా పెట్టుబడిదారుల లాభాలపై పన్నులు పెంచి ప్రజలకు వెసులుబాటు కలిగించడమా? లేక ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్ రంగం లాభాలు కాపాడడమా- ఏదో ఒక మార్గమే ఉంటుంది.'' 
      కార్పొరేట్ల అండతో గెలిచిన మోడీ సర్కార్ ఇప్పుడు ఆ మార్గాల్లో రెండో మార్గం ఎంచుకుంది. ప్రజలకు, కార్మికులకు ఉన్న హక్కులు, రక్షణలు తొలగిస్తే మార్కెట్లు, పెట్టుబడిదారులు వారిని యథేచ్చగా దోపిడీ చేసుకనేందుకు వీలు కలుగుతుంది. కార్పొరేట్ రంగానికి ఇబ్బడి ముబ్బడి లాభాలు సమకూరుతాయి. కార్మిక చట్టాల సంస్కరణ పేరిట ఇదే జరుగుతోంది. ఇన్నాళ్లూ ఇలాంటి సంస్కరణలు దొంగచాటుగా జరిగేవి. ఇప్పుడు పాదర్శకం పేరిట పచ్చిగా అమలు జరుగుతున్నాయి.  విస్తృత కార్మికవర్గ పోరాటాల ద్వారానే ఇలాంటి విధానాలను తిప్పికొట్టగలం.

1 comment: