Monday 6 October 2014

ఉపాధ్యాయుల కొరత తీర్చాల్సింది పోయి... ఉన్నవారిపై కెసిఆర్ బెదిరింపులు

          పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను టిఆర్ఎస్ సర్కార్ పూరించడం లేదు. రేషనలైజేషన్ పేరుతో కావాలనే జాప్యం చేస్తోంది. అరకొర సౌకర్యాలతో, ఉన్న పాఠశాలలను నెట్టుకొస్తున్న టీచర్లను స్వయాన కెసిఆర్ బెదిరించడం దుర్మార్గం.
     `విద్యార్థులు లేకున్నా, పని చేయకున్నా ఎంత టీచర్లయినా కూసుండబెట్టి జీతాలియ్యాలా?` ఇదీ కెసిఆర్ మాట.
     ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు లేరు? ఎందుకు రావడం లేదు? టీచర్లు పని చేయకపోతే సర్వీసు రూల్సు ప్రకారం యాక్షన్ ఎలాగూ ఉంటుంది కదా? కూసోబెట్టి జీతాలు ఇవ్వడం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కెసిఆర్ కు తెలియవని అనుకోవాలా?

      టీచర్లపై బెదిరింపులకు దిగే ముందు ఈ కింది సమస్యలను పరిష్కరిస్తే  మంచిది.
  1. తెలంగాణా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు తక్షణం సర్వీసు రూల్సు రూపొందించి అమలు చేయాలి.
  2. ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు, ముగ్గురు టీచర్లతో తరగతులు కొనసాగుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరు. భాషా పండితులు లేరు. తక్షణమే తాత్కాలిక ఉపాధ్యాయులను, అకాడమిక్ ఇన్స్ ట్రక్టర్లను నియమించాలి.
  3. కొత్త పుస్తకాలు, పరీక్షల విధానంపై టీచర్లకు అవగాహన కల్పించాలి. వెంటనే మారిన పాఠ్య పుస్తకాలపై శిక్షణ ఏర్పాటు చేయాలి.
  4. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల సమస్య త్రీవంగా ఉంది. పరిష్కరించాలి.
  5. హై స్కూళ్లోని పండిట్, పిఇటి పోస్టున్నింటినీ అప్ గ్రేడ్ చేసి ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేయాలి.
  6. పాఠశాలల్లో స్వీపర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మంజూరు చేయాలి. ఉన్నత పాఠశాలలకు జూనియర్ అసిస్టెంట్, రాత్రి పూట కాపలదారు పోస్టులను మంజూరు చేయాలి.
  7. ఆర్ వి ఎం, ఆర్ఎంఎస్ఎ గ్రాంట్లను పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మంజూరు  చేయాలి.
  8. కంప్యూటర్, ఆర్ట్, పని విద్యకు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలి.
పై ఎనిమిది సమస్యలను పరిష్కరిస్తే పాఠశాలలు విద్యా బోధనకు వీలుగా ఉంటాయి. విద్యార్థుల సంఖ్య పడిపోదు.
  1. 10వ పిఆర్సిని వెంటనే అమలు చేయాలి. హెల్త్ కార్డ్స్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి.
  2. స్పెషల్ టీచర్ సర్వీసుకు నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.
  3. ఎంఇఓ, డిప్యూటి ఇఓ, డైట్ లెక్చరర్ ఖౄళీలను అడ్హక్ రూల్సులలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి.
  4. రిటైర్మెంట్ సందర్భంగా అర్థజీతపు సెలవు అమ్ముకునే సౌకర్యం కల్పించాలి.
  5. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలి. 
  6. అప్ గ్రేడ్ పండిట్లకు నష్టం కలిగించిన యాక్ట్ 1-2005ను ప్రాస్పెక్టివ్ గా అమలు చేయాలి.
  7. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు నష్టం కలిగించే యాక్ట్ 37-2005ను ప్రాస్పెక్టివ్ గా అమలు చేయాలి.
పై ఏడు సమస్యలను పరిష్కరిస్తే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ టీచర్లు భావి భారత పౌరులను తీర్చిదిద్దే పనుల్లో ఉంటారు.


No comments:

Post a Comment