Monday 11 August 2014

ఎఫ్ డీ ఐ లకు ఎర్రతివాచి


కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యుపిఎ ప్రభుత్వం అవలంబించిన నయా ఉదారవాద విధానాలు కొనసాగించడమే గాక మరింత వాటిని ఉదృతం చేస్తోంది. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఎఫ్ డీ ఐలను వ్యతిరేకించిన బీజేపీ, అధికారంలోకి రాగానే రైల్వేలలోఎఫ్ డిఐల ప్రవేశం, రక్షణ, బీమా రంగాల్లో 49 శాతం ఎఫ్ డిఐ వంటి నిర్ణయాలను తీసుకొచ్చింది. పిపిపి పేరిట ప్రజావనరులను ఫణంగా పెట్టి బడా పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది. పన్ను సర్దుబాట్లు విదేశీ పెట్టుబడిదారులకు ఉన్నత వర్గాలకే ఉపయోగపడేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సామాన్య ప్రజలకు ఉపయోగపడే పథకాలపై వ్యయాన్ని కుదించింది. ఇక బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులే లేవు. ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంధన సబ్సిడీలో తీవ్రంగా కోతవిధిస్తోంది. పీపీపీల పేరుతో కార్పొరేట్లకు ఎర్రతివాచి పరిచే అభివృద్దే దేశాభివృద్ధిగా చెబుతున్న బీజేపీ సామాన్యులపై భారాలు మోపుతోంది. మోడీ ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సీపీఎం రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రజాపోరాటాలలో కలిసొచ్చే అన్ని శక్తులను కలుపుకుని పోరాటాలను మరింత ఉధృతం చేయనుంది.    

No comments:

Post a Comment